Saturday, September 21, 2024

AP: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కిలారి రోశయ్య భేటీ..

మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవల వైకాపాకి రాజీనామా చేశారు. అయితే ఆయ‌న‌ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఆయనతో పాటు వియ్యంకుడు రవిశంకర్‌ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోశయ్య.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement