Friday, October 18, 2024

Kankipadu – ప‌వ‌న్ స‌భ‌లో ‘ఓజీ’… ‘ఓజీ’ అంటూ నినాదాల హోరు

వెంట‌నే స్పందించిన ప‌వ‌న్ స్టార్
మీరు ఓజీ అంటుంటే మోదీలా వినిపిస్తుంది..
వినోదం అంద‌రికి కావాలి…
వినోదాలు.. ఓజీలు. మీరు సినిమాకు వెళ్లాలన్నా
మంచి రోడ్లు కావాలి.. అవి చూడాలంటే డ‌బ్బులు కావాలి
అందుకే ముందు మ‌నం క‌డుపు నింపే ప‌ని ప్రారంభించాం
అంద‌రూ హీరోలు బాగుండాలి…
టాలీవుడ్ హీరోలంద‌రూ నిష్ణాతులే..
వారంద‌రికీ జై కొట్టాలంటే మ‌న ఆర్థిక ప‌రిస్థితి బాగుండాలి..

కంకిపాడు – సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లెపండగ’ కార్యక్రమంలో అభిమానులు ఓజీ అంటూ నినాదాలు చేయగా ఆయన స్పందిస్తూ,
‘‘మీరు ‘ఓజీ.. ఓజీ..’ అంటుంటే నాకు ‘మోదీ.. మోదీ’ అని వినిపించేది. వినోదం అందరికీ కావాల్సిందే. ఈ పల్లె పండగ ఎందుకు చేస్తున్నామో మీకు చెబుతా. రేపు మీరంతా మీ అభిమాన కథానాయకుల సినిమాలకు వెళ్లాలి. టికెట్ల కోసం డబ్బులు పెట్టాలి అంటే మీ చేతిలో డబ్బులు ఉండాలి. వినోదం కన్నా ముందు ప్రతీ ఒక్కరి కడుపు నిండాలి. అందుకే ముందు కడుపు నింపే పని చేద్దాం. మన రోడ్లు, స్కూల్స్‌ను బాగు చేసుకుందాం. ఆ తర్వాతే విందులు.. వినోదాలు.. ఓజీలు. మీరు సినిమాకు వెళ్లాలన్నా గోతులు లేని రోడ్లు ఉండాలి కదా! నన్ను మీరెలా అభిమానిస్తారో, నాకు కూడా వేరే హీరోలు అంటే ఇష్టమే. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోలతోనూ ఇబ్బంది లేదు. నేను ఎవరితోనూ పోటీపడను. ఒక్కొక్కరూ ఒక్కో దాంట్లో నిష్ణాతులు. అందరూ బాగుండాలని కోరుకుంటా. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, నాని అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ అభిమాన హీరోలకు జై కొట్టేలా ఉండాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ముందు దానిపై దృష్టిపెడదాం’’ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement