Monday, September 16, 2024

Kaikaluru – ఎమ్మెల్యే కామినేనికి తప్పిన ప్రమాదం

పందిరిపల్లిగూడెంలో ప్రమాదం
కొల్లేరు బురదలో చిక్కిన కారు
నాయకులు అప్రమత్తం
సురక్షిత ప్రాంతానికి తరలింపు

( ఆంధ్రప్రభ స్మార్ట్, మండవల్లి (కృష్ణాజిల్లా) – కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కొల్లేరు నీటిలో మునిగి, బురదలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన నాయకులు కామినేనిని కిందకు దింపి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద జరిగింది.

- Advertisement -

బుడమేరు ప్రవాహం కొల్లేరులో ఉధృతిగా కలుస్తోంది. దీంతో గుడివాడ, కైకలూరు, కలిదిండి ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు భారీగా చేరింది. అంతేకాదు చేపలు, రొయ్యల చెరువులు నీట మునిగాయి. వీటిని మూడు రోజులుగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పరిశీలిస్తున్నారు. ప్రజలకు భరోసా ఇస్తూ ఆర్థికంగా సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కామినేని పందిరిపల్లి గూడేనికి వెళ్తున్నారు. రోడ్డుపై ప్రవహిస్తున్న కొల్లేరు వరదలో ఆయన వాహనం చిక్కుకుని బురదలో కూరుకుపోవడంతో భద్రతా సిబ్బంది తాళ్ల సాయంతో బయటకు తీసుకు వెళ్లారు. దీంతో ఆయనకు పెను ప్రమాదం తప్పడంతో కైకలూరు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement