Friday, October 4, 2024

Kadapa: అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. కలెక్టర్

కడప ప్రతినిధి, జులై 6 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో, జిల్లా ప్రజల అభిమానంతో జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని.. వైఎస్ఆర్ జిల్లా నూతన కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న ఆయన.. కలెక్టర్ చాంబర్ లో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఉదయం 11గంటల సమయంలో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సహకారంతో.. కలెక్టర్ గా.. కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను.. ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం పలువురు జిల్లా అధికారులు, ప్రముఖులు, పాత్రికేయులు, తదితరులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి జిల్లా కలెక్టర్ కు తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ గణేష్ కుమార్, కడప నగర కమిషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, డిఆర్వో గంగాధర్ గౌడ్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement