Friday, October 18, 2024

AP: కౌంటింగ్ కు నాలుగంచెల పటిష్ట భద్రత… ఎస్.పి సిద్దార్థ్ కౌశల్

కడప, జూన్ 3: ఈనెల 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ స్థానిక మోంట్ ఫోర్ట్ స్కూల్ లో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ…. కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న జిల్లా పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఏ.పి.ఎస్.పి బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

పోలీస్ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూ.ఆర్.టి) లు సిద్ధంగా ఉంటాయని, ఘటన గురించి ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారని ఎస్.పి తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) లో సుధాకర్, ఏ.ఆర్ అడిషనల్ ఎస్.పి ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్, ఏ.ఆర్ డి.ఎస్.పి మురళీధర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజు, రిమ్స్ సి.ఐ కె.రామచంద్ర, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement