Thursday, October 17, 2024

Kadapa: ఏటీఎంలో చోరీకి యత్నం..

కడప బ్యూరో – ప్రభ న్యూస్ : కడప జిల్లా ఖాజీపేట ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏటీఎం గదిలోని సీసీ కెమెరాలకు స్టిక్కర్ అంటించి చోరీకి యత్నం చేశారు. ఏటీయం మిషన్ ముందు భాగం తొలగించడంతో అలారం మోగింది.

అలారం మోగడంతో దుండగుడు పరారైనట్లు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఏటీఎం గదిని పరిశీలించారు. నగదు చోరీ కాలేదని నిర్ధారణకు వచ్చారు. చోరీకి యత్నించిన దుండగుడు వచ్చిన ఏపీ39డీక్యూ7371 బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్ నెంబరు, సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement