Monday, October 21, 2024

క‌డ‌ప జిల్లాలో ప్రశాంతంగా‌ కొన‌సాగుతున్న పోలింగ్

క‌డ‌ప న‌గ‌ర పాల‌క సంస్థ‌ ఎన్నిక‌ల పోలింగ్ నేటి ఉద‌యం ప్రారంభ‌మైంది… ఓట‌ర్లు ఉద‌యాన్నే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు… పోలీసులు అత్యంత సమస్యాత్మక వార్డులలో బారీ ఎత్తున పోలీసు బలగాలు మొహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. తొలిగంట‌లోనే 8 శాతం మంది త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. కాగా, జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు ప్రొద్దుటూరు, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటలనుండి ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నారు.. మొత్తం 135 వార్డుల‌లో 395 పోలింగ్ కేంద్రాల్లో 3, 80, 044 మంది ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగించుకోనున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అధికారులకు తగు సూచనలు జారీచేస్తున్నారు జేసిలు ఎం. గౌతమి, సి.యం. సాయికాంత్ వర్మలు

Advertisement

తాజా వార్తలు

Advertisement