Tuesday, September 17, 2024

AP | చివ‌రికి గెలిచేది న్యాయ‌మే.. సుప్రీంకోర్టు తీర్పుపై షర్మిల

వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ గతంలో కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం నిషేధించింది. సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు.

దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడు పగిలాలే వివేకానందరెడ్డి రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా ఈ ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు వైఎస్ షర్మిల. సుప్రీంకోర్టు ద్వారా అందిన విజయం తొలి అడుగు మాత్రమే అన్నారు.

రాబోయే రోజుల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులకు శిక్ష పడే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. చిట్ట చివరగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని వైఎస్ షర్మిల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement