Friday, October 18, 2024

AP : శ్రీవారి సేవ‌లో జేపీ న‌డ్డా

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు ద‌ర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు.

- Advertisement -

అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. జేపీ నడ్డాతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. అంత‌కు ముందు ఆలయానికి చేరుకున్న జేపీ నడ్డాకు ఆల‌య‌ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇవాళ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా తిరుపతిలో కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) నిర్వహించిన మెగా రోడ్‌షోలో నడ్డా పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement