Monday, September 16, 2024

AP – విజ‌య‌మ్మ‌తో జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి భేటి

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఎపి రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్‌ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆమెతో అప్యాయంగా మాట్లాడారు.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైఎస్‌ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విషయం విదితమే వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు ప్ర‌భాక‌ర‌రెడ్డి సోద‌రుడు జేసీ దివాకర్‌రెడ్డి అయితే, వైఎస్‌ రెండో కేబినెట్‌లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు.. దీంతో టిడిపి చేరిపోయారు.. తాజాగా విజ‌య‌మ్మ‌ను క‌లువ‌డం చ‌ర్చంచ‌నీయ‌మైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement