Saturday, October 5, 2024

జనవాణి వారం వాయిదా.. జనసేనాని ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు వైర‌ల్ ఫీవ‌ర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘జనవాణి జనసేన భరోసా’ కార్యక్రమం ఒక వారం వాయిదా పడినట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం వైరల్‌ జ్వరానికి గురయ్యారని తెలిపారు. అంతే కాకుండా మరి కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారన్నారు.

అందువల్ల వచ్చే ఆదివారం అంటే ఈ నెల 24న కాకుండా 31వ తేదీన జనవాణి జరుగుతుందని, స్థలం, వేదిక వివరాలను త్వరలోనే తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే విజయవాడ రెండు, భీమవరంలో మూడో విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయిన విషయం విదితమే. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరుగుతాయని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement