జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దంపతులు నేడు కాశీ విశ్వనాధుని దర్శించుకున్నారు. సతీమణి అనాతో కలిసి పూజలు, అభిషేకం చేయించారు . విశ్వ నాథుని దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. అయన వెంట ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా ఉన్నారు
వారణాశిలో నేడు జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనాని అనంతరం కాశీ ఆలయాన్ని సందర్శించారు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారణాశిలో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు ఆలయ ప్రాంగణాన్ని… pic.twitter.com/THCylCxhfn
— JanaSena Party (@JanaSenaParty) May 14, 2024