Tuesday, July 2, 2024

AP: పుంగనూరులో వైసీపీకి జలక్.. 17మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిక

పుంగనూరు, జూన్27 (ప్రభ న్యూస్) : పుంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీకి కౌన్సిలర్లు భారీగా షాకిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో సహా సుమారు 17మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని కలిసి టీడీపీ పార్టీలో చేరారు.

పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారడంపై ఇంకా సర్పంచులు, ఎంపీటీసీలు మిగిలిన కౌన్సిలర్లు సైతం పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement