Tuesday, September 17, 2024

AP: సుబ్బారాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ..

కర్నూల్ బ్యూరో : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నంద్యాల పర్యటనలో ఉన్నారు. ఇటీవలే హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. నంద్యాల పర్యటనకు వచ్చిన సందర్భంగా జగన్ నాయకులు ఘన స్వాగతం పలికారు.

నంద్యాల పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇవాళ‌ మధ్యాహ్నం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నంద్యాల బయలుదేరిన‌ ఆయనకు ఓర్వకల్లు నుంచి దారి పొడవునా అడుగడుగునా జనం నీరాజనం పలకడం గమనార్హం. ఆయనకు ఘన స్వాగతం పలికిన వారిలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, హఫీస్ ఖాన్, కర్నూల్ మేయర్ బివై రామయ్య, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement