Friday, September 6, 2024

AP: ప్రతిపక్ష నేత హోదా కోసం.. ఏపీ హైకోర్టుకు జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతుండగా… కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు.

ఈ నేపథ్యంలో, జగన్ ఇవాళ‌ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement