Sunday, September 8, 2024

వివేకా హ‌త్య కేసులో జ‌గ‌న్ ను విచారించాలి : కొల్లు ర‌వీంద్ర‌

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ కేసులో ప్రధాన నిందితుడు సీఎం జగన్‌రెడ్డేనని, జగన్‌తో పాటు అతని కుటుంబసభ్యులను సీబీఐ విచారించాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఎంపీ అవినాష్‌రెడ్డిని సానుభూతితో గెలిపించుకునేందుకు.. వివేకాను హత్య చేసి సొంత మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వివేకా కుమార్తె పోరాటంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారించి దోషులను శిక్షించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement