Sunday, September 8, 2024

ఉగాది వేడుకల్లో పాల్గొన్న‌ జగన్ దంపతులు

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దంప‌తులు ఉగాది వేడుక‌ల్లో పాల్గొన్నారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు. వేద పండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తొలుత దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించిన అనంతరం జగన్ దంపతులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను జగన్ ప్రారంభించారు. అనంతరం జగన్ దంపతులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అన్ని రకాల కష్టాల నుంచి ఏపీ బయట పడుతుందని పండితులు పంచాంగ శ్రవణంలో చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement