Friday, September 20, 2024

AP | 4వతేదీ నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్..

అమరావతి, ఆంధ్రప్రభ: ఐసెట్‌ రెండవ విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను రేపు (బుధవారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ పి. ఉమామహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌ రిజి స్ట్రేషన్‌ రేపు 4 నుంచి 7వరకు జరగనున్నట్లు తెలిపారు. 5 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. 9 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు.

15వ తేదీ వెబ్‌ ఆప్షన్‌లలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించామన్నారు. 17న సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. 17 నుంచి 21వ తేదీలోగా కేటాయించిన కళాశాలలో అభ్యర్ధులు రిపోర్టింగ్‌ చేయాల ని కన్వీనర్‌ ఉమామహేశ్వరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement