Friday, September 20, 2024

IPS Officers – ఎపి , తెలంగాణ‌కు ట్రైనీ ఐపిఎస్ లు…

హైద‌రాబాద్ – కేంద్రం ప్ర‌భుత్వం ఎపి, తెలంగాణ‌కు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది.మొత్తం ఎనిమిది మంది ఐపిఎస్ ల‌ను ఈ రెండు రాష్ట్రాల‌కు పంప‌నుంది. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు) ను కేటాయించింది..ఇక తెలంగాణకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్‌ (తెలంగాణ), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్‌)ను కేటాయించింది..ఇక ఈ కొత్త ఐపిఎస్ లు ఈ నెల 20న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ నేషనల్ పొలీస్‌ అకాడమీలో జ‌రిగే పాసింగ్ పేరేడ్ లో పాల్గొన‌నున్నారు.. అనంత‌రం వారికి కేటాయించిన రాష్ట్రాల‌లో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement