Friday, October 18, 2024

జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తుల ఆహ్వానం..

అమరావతి, ఆంధ్రప్రభ: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు కె.హర్షవర్థన్‌ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కాపు కులాలకు చెందిన విద్యార్థుల నుంచి 200 లోపు క్యూఎస్‌ ర్యాంకు ప్రకారం ఏదైనా దేశంలోని యూనివర్సిటీల్లో, విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలని, 35 సంవత్సరాలకు మించి వయసు ఉండకూడదన్నారు.

డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్‌ కోర్సుల్లో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ను కలిగి ఉండాలన్నారు. ఎంబీబీఎస్‌ కోర్స్‌లో నీట్‌ క్వాలిఫై ఉండాలన్నారు. వంద శాతం లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలం, విద్యాసంస్థలో అడ్మిషన పొందితే ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. 101 నుంచి 200 లోపు ర్యాంకు గల విశ్వ విద్యాలయం, విద్యాసంస్థలో అడ్మిషన్‌ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు ఏది తక్కువ అయితే దాని ప్రకారం చెల్లించడం జరుగుతోందన్నారు. అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తుల్ని హెచ్‌టీటీపీఎస్‌://జెఎన్‌ఎఎన్‌ఎబిహెచ్‌యుఎంఐ డాట్‌ ఏపీ జీఓవీ డాట్‌ ఇన్‌ నందు నమోదు చేయాలన్నారు. ఈనెల 30 లోపు దరఖాస్తుల్ని ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సిందిగా సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement