ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో మరో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే విశాఖపట్నంలోని అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నాయి. కాగా, త్వరలో విజయవాడలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అందుబాటులోకి రానుంది.
ఆరు నెలల్లో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) వెల్లడించారు. అలాగే విజయవాడలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. వీటితో పాటు 2027 జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.