Tuesday, September 24, 2024

Indrakeeladri – ప్రాయ‌శ్చిత్త దీక్ష – క‌న‌క‌దుర్గ ఆల‌య మెట్లు శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్

విజయవాడ – తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దీక్ష‌లో భాగంగా ఆయ‌న ఇవాళ విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ఆల‌యంలో శుద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

మొద‌ట ఆల‌యం మెట్ల‌ను నీటితో జ‌న‌సేనాని శుభ్రం చేశారు. అనంత‌రం మెట్ల‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు బాలశౌరి, కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ హ‌రిప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

.ఇక ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష‌ను తిరుమ‌ల‌లో అక్టోబ‌ర్ 1న ప‌వ‌న్ విర‌మించ‌నున్నారు. దీనికోసం ఆయ‌న తిరుప‌తి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమ‌ల‌కు న‌డుచుకుంటూ వెళ్ల‌నున్నారు. 2వ తేదీన వెంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్న త‌ర్వాత దీక్ష విర‌మించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement