Wednesday, October 9, 2024

Indrakeeladri – దుర్గ‌మ్మ సేవ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ …

విజయవాడ:శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తీర్ధప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. పవన్ తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు మరో మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. కాగా, తొలుత ఆలయం వద్ద అధికారులు పవన్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement