Wednesday, October 9, 2024

Indrakeeladri – దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

విజయవాడ: ద‌స‌రా శ‌ర‌న్న‌వరాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా మూల న‌క్షత్ర‌మైన నేడు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున క‌న‌క‌దుర్గ‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంత‌రం ఆయ‌న కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయ‌న‌ వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. అంతకుముందు ఆలయం వద్ద సీఎంకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంత‌రం చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు.. ఆ త‌ర్వాత ఆలయ అధికారులు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement