Saturday, September 7, 2024

AP: మహానందిలో మరోసారి చిరుత కలకలం..

మహానందిలో మ‌రోసారి చిరుత సంచరించింది. మహానంది పరిసర ప్రాంతాల్లోనే చిరుత సంచారం కొనసాగుతుండడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయిందనే అటవీ అధికారుల మాటలు నీటి మూటలుగా మారాయి. చిరుత సంచారంతో గత 15 రోజులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం గుప్పిట్లో భక్తులు బిక్కు బిక్కుమంటున్నారు.

ఇక సామాన్య ప్రజల.. సంగతి చెప్పనవసరం లేదు. మహానంది ఆలయ సమీపంలో చిరుత పులి సంచారంపై సీసీ ఫుటేజ్ లో రికార్డు అయిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement