Friday, October 18, 2024

AP | చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. నాది ప్రోగ్రెస్ రిపోర్ట్ : జగన్

పల్నాడు జిల్లాలోని అయ్యప్ప నగర్‌లో వైఎస్ఆర్ సీపీ మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ… చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే, పేద ప్రజలకు అందే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వైఎస్ జగన్ వెల్లడించారు. మే 13న జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎన్నుకునే ఎన్నికలు కాదని.. మన తల రాతలను మనమే నిర్ణయించుకునే ఎన్నికలు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని.. ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు. ఇందులో జగన్ పేదల పక్షపాతి అని అన్నారు. కాబట్టి, కుటుంబంలోని ప్రతి ఓటు వైఎస్ఆర్ సీపీకి వేయాలని పిలుపు ఇచ్చారు. జగన్ కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుందని.. చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ మంచి, పథకాలు అన్ని ఆగిపోతాయని అన్నారు.

చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా?.. బాబు హయాంలో ఒకరికైనా మంచి జరిగిందా?. జాబు రావాలంటే ఎవరు కావాలి? అన్నారు.. ఏం జరిగిందో అందరు చూశారు.. కానీ, జాబు రావాలంటే ఫ్యాన్ రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్‌ రావాలా? అని ఆయన ప్రశ్నించారు. మేం అధికారంలోకి రాగానే 2 లక్షల 31 ఉద్యోగాలను భర్తీ చేశాం.. పేదలకు వైద్య సేవలను ఇంటి వద్దకు తీసుకెళ్లాం.. గతంలో రైతులకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు మేలు చేస్తాడని గొప్పలు చెబుతున్నాడు.. చంద్రబాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ అని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement