Thursday, September 12, 2024

Icthapuram – నాట్లు వేస్తుండగా కబళించిన మృత్యువు

ఇచ్ఛాపురం , ఆగష్టు 28 ( ప్రభ న్యూస్): పిడుగుపాటుకు ఓ మహిళ బలైంది తన వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వివరాల్లోకి వెళితే ముచ్చింద్ర గ్రామానికి చెందిన సాడి సోమయ్య భార్య సాడి.జానకమ్మ ( 45 ) పొలములో వరి నాట్లు వేస్తుండగా సాయంత్రం 5 గంటల సమయంలో వర్షంతో పాటు ఉరుములు రావడంతో ఆమెపై పిడుగు పడింది.

. వరి నాట్లు వేస్తున్న పొలo లోనే కుప్పకూలింది. పొలంలో నాట్లు వేస్తున్న గ్రామస్తులు , ఆమె కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. :

Advertisement

తాజా వార్తలు

Advertisement