Saturday, October 19, 2024

Ibrahimpatnaam – ఎన్టీటీపీఎస్ లో నిలిచిన విద్యుదుత్పత్తి

(ప్రభ న్యూస్, ఇబ్రహీంపట్నం)ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ లో మంగళవారం రాత్రి సాంకేతిక లోపం తలెత్తి విద్యుదుత్పాదనకు అంతరాయం ఏర్పడింది. యూనిట్లు ట్రిప్ అయిన కారణంగా ఐదు యూనిట్లలో విద్యుదుత్పాదన నిలిచిపోయింది.

మొత్తం 2560 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాల్సి ఉండగా 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ట్రిప్ అయి విద్యుదుత్పత్తి నిలిచిపోయిన యూనిట్లలో సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. బుధవారం యూనిట్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే అవకాశం ఉందని ఎన్టీటీపీఎస్ అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement