Sunday, September 22, 2024

AP | వరద బాధితులకు బిగ్ రిలీఫ్.. చంద్రబాబు కీల‌క నిర్ణ‌యం !

ఏపీలో వరద బాధితులకు పరిహారం విడుదలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారికి ఈ నెల 25న పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై చంద్రబాబు ఇవాళ సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఇప్పటికే వరద నష్టంపై అంచనా ప్రక్రియ పూర్తి అయినట్లు అధికారులు చంద్రబాబుకు తెలియజేశారు. దీంత ఈ నెల 25న బాధితుల అకౌంట్లలోకి పరిహారం డబ్బులు జమచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాల ఇన్సూరెన్స్‌ కూడా త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement