Tuesday, September 17, 2024

AP | సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు…

ఏపీ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. తాజాగా వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం విరాళాలు అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బాబును క‌లిసి రూ.11 కోట్ల 12 లక్షల 50 వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

ఇక‌ దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ.కోటి, వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు, వై.రాజారావు రూ.10 లక్షలు, కె.సాంబశివరావు రూ.5 లక్షలు, సి.టి.చౌదరి రూ.2.55లక్షలు, శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఒనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2.21లక్షలు, వెలగపూడి సత్యనారాయణ రూ.2లక్షలు, ఎమ్.శ్రీనివాసరావు రూ.2లక్షలు, పువ్వాడ రామకృష్ణ రూ.2లక్షలు విరాళం అందించారు.

సీహెచ్.శివరామకృష్ణ రూ.1.32లక్షలు, నవీన్ బాబు రూ.1.16లక్షలు, జాస్తి శైలజారాణి రూ.లక్ష, శాంభవి రూ.లక్ష, జె.శశాంక్ చౌదరి రూ.లక్ష, ఎస్.సాంబశివరావు రూ.లక్ష, దూళిపాళ్ల రామకృష్ణ రూ.లక్ష, డాక్టర్ యు.గంగాధర్ రెడ్డి రూ.లక్ష, చెరుకూరి వెంకటరావు రూ.లక్ష, జె.సత్యనారాయణ మూర్తి రూ.లక్ష, ఎన్.నాగేశ్వరరావు రూ.70 వేలు, రాణి శారదా రూ.50వేల విరాళం చెక్కును సీఎంకు అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సాయం అందిస్తున్న దాతలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement