Thursday, October 24, 2024

Vandebharat | మంగళవారం వందేభార‌త్ కు సెలవు..

విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయింది. డిసెంబర్‌ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు అధికారులు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

సికింద్రాబాద్ – వైజాగ్ నుంచి టైమింగ్స్

మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో స్టార్ట్ అయ్యి… 4.35 గంటలకు వరంగల్‌, 5.45 గంటలకు ఖమ్మం, 7 గంటలకు విజయవాడ, 8.50 గంటలకు రాజమండ్రి, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5.45 గంటలకు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి… 7.55 గంటలకు రాజమండ్రి, 10 గంటలకు విజయవాడ, 11 గంటలకు ఖమ్మం, 12.05 గంటలకు వరంగల్, 2.15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement