Monday, October 7, 2024

AP I & PR డైరెక్టర్ గా హిమాన్షు బాధ్యతలు స్వీకరణ

ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ రెండో అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్‌గా బాధ్యతలు చేప‌ట్టారు. అనంత‌రం I&PR అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సమాచార పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు హిమాన్షు శుక్లాకు ఐ అండ్ పీఆర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్ .స్వర్ణలత, ముఖ్య సమాచార ఇంజనీర్ ఒ.మధుసూధన, సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ , తేళ్ల కస్తూరి, ప్రాంతీయ సమాచార ఇంజినీర్లు నాగరాజు, సి.వి. కృష్ణారెడ్డి సహాయ సంచాలకులు జివి. ప్రసాద్, ఎం. భాస్కర్ నారాయణ, వెంకటరాజు గౌడ్, ఎఫ్‌డిసి జనరల్ మేనేజర్. శేషసాయి, ఐఅండ్ పీఆర్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement