Tuesday, October 15, 2024

AP: విశాఖపట్నం నుంచి ఖమ్మం కు హెలికాప్టర్..!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్ర‌య‌త్నం


ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వరద ఉధృతి వల్ల ఖమ్మం పట్టణం ప్రకాష్ నగర్, తీర్థాల, వాల్యతండా లో కొంతమంది చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో ఫోన్ లో మాట్లాడి చెప్పారు.

అయితే హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక హెలికాప్టర్ రావ‌డానికి ఇబ్బందిక‌రంగా ఉండ‌డంతో విశాఖపట్నం నుంచి తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ లో ఈ విషయమై మాట్లాడారు. హెలికాప్టర్ పంపించడానికి ఏపీ సిఎస్ సానుకూలంగా స్పందించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ అధికారులతో ఈ విషయమై సమన్వయం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement