Friday, October 4, 2024

AP: సుంకేసుల బ్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల..

శ్రీశైలం చేరుకుంటున్న జలాలు
సుంకేసుల బ్యారేజ్ కి వరద జలాలు భారీగా చేరుకుంటున్నాయి. ఎగువన తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న సుంకేసుల బ్యారేజ్ కి వరద ప్రవాహం పోటెత్తింది. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీ పూర్తిస్థాయి కెపాసిటీ 1.235 టీఎంసీలు, ప్రస్తుతం 0.438 టీఎంసీల నీటిని నిలువ చేశారు.


ఇక బ్యారేజీకి 1.02 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి చేరుతుంది. దీంతో బ్యారేజ్ కి చెందిన 28గేట్లను ఓపెన్ చేసి 99,736 క్యూసెక్కుల నీటిని దిగువనున్న‌ నదిలోకి వదులుతున్నారు… ఇదే సమయంలో కేసీ కెనాల్ (కర్నూల్ కడప కాలువ) కు 1540 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement