Wednesday, October 9, 2024

AP | ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన నిర్వాహకులుగా పెన్మత్స రామచంద్రరాజు

గుంటూరు : అమరావతి గుంటూరులో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల 2026కు “ప్రధాన సంచాలకులు”గా పెన్మత్స రామచంద్రరాజు నియమితులైనట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు భారతీయ విద్యాభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పి.రామచంద్రరాజు, కో-ఆర్డినేటర్ వాసిరెడ్డి విద్యాసాగర్‌లకు నియామక పత్రాలను అందజేశారు. 3,4,5 జనవరి 2026 లో జరుగనున్న 3 వ ప్రపంచ తెలుగు మహా సభల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పి. రామచంద్ర రాజు తెలిపారు.

ఈ సమావేశంలో డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్ సహస్రావధాని, రెడ్డప్ప ధవేజీ, సింగం లక్ష్మీనారాయణ, వడ్లమాని రవి, బాబుశ్రీ, అడ్డాల వాసు, అన్నప్రగడ రవి, లఖ్హం రాజు సునీత, కంచర్ల ఆంజనేయులు, మేడికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement