Thursday, October 17, 2024

ర‌ఘ‌రామ‌రాజుకి హైకోర్టు లో ఊర‌ట‌…అరెస్ట్ కు నో…

అమరావతి: ఏపీ హైకోర్టులో న‌ర్సాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. న‌ర్సాపురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా..అరెస్ట్‌ చేయొద్దని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై వివిధ పోలీస్ స్టేష‌న్ ల‌లో ఇత‌రులు చేసిన‌ ఫిర్యాదులు ఆధారంగా ఎఫ్ ఐ ఆర్ లు న‌మోద‌య్యాయి.. దీనిన ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు.. సొంత నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా కేసులు వేశారని హైకోర్టుకు రఘురామకృష్ణరాజు విన్న‌వించారు.. వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement