Monday, July 1, 2024

AP: వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలోని వైఎస్సార్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పింటించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని వైఎస్ఆర్సీపీ వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement