Thursday, October 17, 2024

Guntur – వైసిపికి మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి బైబై..

గుంటూరు వైసిపి అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు
క్రీయాశీల‌క స‌భ్య‌త్వానికి రాజీనామా

ఆంధ్ర‌ప్ర‌భ స్టార్ట్ – గుంటూరు – ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవితో పాటు వైసీపీ క్రియాశీలక సభ్యతానికి కూడా రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి.. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే వైసీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement