Friday, September 20, 2024

Gun Shot – అటు అప్పులు.. ఇటు అనారోగ్యం

ఆంధ్రప్రభ స్మార్ట్, సంబేపల్లి (అన్నమయ్య జిల్లా) అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామంలోని తిరుమల రాయగుట్ట జగనన్న కాలనీలో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో నాటు తుపాకితో కాల్చుకుని రాజగోపాల్ (47) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం, చిన్నమండెం మండలం బోనుమల గ్రామం కనకంటి వారి పల్లి కి చెందిన రాజగోపాల్ తన కుటుంబంతో కలిసి రెండేళ్ల కిందట జగనన్న కాలనీ సమీపంలో ఇటుకలు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నాడు. ఇటు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అటు అనారోగ్యంతో సతమతం అవుతున్నాడు. ఇటీవలే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఆర్థిక బాధలు ఆరోగ్య బాధలు తాళలేక తాగుడుకు బానిసై రాజగోపాల్ మంగళవారం ఉదయం కుటుంబ సభ్యుల ఎదుటే నాటు తుపాకీని గడ్డం కింద పెట్టుకొని కాల్చుకున్నాడు.

విషయం తెలుసుకున్న సీఐ తులసీరాం, ఎస్ఐ రామకృష్ణ ఘటన స్థలకి చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement