Saturday, September 14, 2024

Gun Fire – అమెరికాలో కాల్పులు… బాప‌ట్ల యువ‌కుడు మ‌ర‌ణం

అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) గా గుర్తించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆర్కెన్సాస్ లో ఉన్న ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. శనివారం (జూన్ 22) మధ్యాహ్నం అతను కౌంటర్లో ఉండగా.. సూపర్ మార్కెట్ లోపలికి వచ్చిన ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు.


ఈ కాల్పుల్లో గోపికి తీవ్రగాయాలవ్వడంతో.. అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగులు షాపులోని ఒక వస్తువుని తీసుకుని పరారయ్యాడు. తీవ్రగాయాలైన గోపిని సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు గోపి మరణవార్త సమాచారం అందించగా వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని మరణంతో స్వగ్రామమైన యాజలిలో విషాదఛాయలు అలుముకున్నారు. సీసీ కెమెరాలలో గోపిపై దుండగుడు జరిపిన కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. కాగా.. గోపి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement