Saturday, September 7, 2024

AP: తుపాకీ పేలి… ఆర్మీ జవాన్ మృతి…

అవుకు రూరల్, జులై 20 (ప్రభ న్యూస్) : మండలంలోని జూనూతుల గ్రామానికి చెందిన ఆర్మీ జవాను సీఐఎస్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్న పెట్నీకోట వెంకటేష్(34) అనే జవాన్ హైదరాబాదులోని సిఐఎస్ఎఫ్ (బీడీఎల్, బనూర్) బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తుండేవారు. విధుల్లో ఉండగా తమ బెటాలియన్ కు చెందిన బస్సులో తన వద్ద ఉండే తుపాకీ పేలినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. తమ వద్ద ఉండే గన్ పేలడంతో తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోవడంతో జవాను అక్కడికక్కడే బస్సులోనే రక్తపు మడుగుల్లో కుప్ప కూలిపోయాడు.

బస్సులో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మిస్ ఫైర్ అయ్యి జరిగిందా… లేక ఇంకేమైనా జరిగిందా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతిచెందిన సిపాయి 13 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరాడు. మృతిచెందిన జవాను గతంలో రెండు సంవత్సరాల పాటు ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం (ప్రధానమంత్రి రక్షణ దళం) వద్ద విధులు నిర్వర్తించాడు. మృతునికి ఒక కూతురు, కుమార్తె ఉన్నారు. తండ్రి పెట్నికోట వడ్డే వెంకటస్వామి, తల్లి కూలీ పనులు చేస్తూ జూనూతల గ్రామంలోని నివసిస్తున్నారు. ఉద్యోగంలో ఉన్న కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement