Monday, July 8, 2024

Greetings – ఒలింపిక్స్ లో ఇద్ద‌రు తెలుగ‌మ్మాయిలు – విషెస్ చెప్పిన సిఎం చంద్ర‌బాబు

మరికొన్ని రోజుల్లో ఒలింపిక్ క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ కు ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ మహానగరం ఆతిథ్యమిస్తోంది. ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందంలో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి, దండి జ్యోతిక శ్రీ కూడా ఉన్నారు. దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హార్షం వ్య‌క్తం చేశారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఆణిముత్యాలు క్రీడా జగత్తులో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.

జ‌గ‌న్ విషెస్ ..
మనమ్మాయిలు జ్యోతి యర్రాజి, డి.జ్యోతిక శ్రీ పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తుండడం చూస్తుంటే అమిత గర్వంగా ఉందని పేర్కొన్నారు మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ . మీ కృషి, పట్టుదలతో ఇప్పటికే ఏపీకి వన్నె తెచ్చారని జగన్ కొనియాడారు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లోనూ పతకాలు గెలవాలన్న మీ లక్ష్యం దిశగా మీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement