Saturday, September 7, 2024

AP: కాకినాడ‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్…

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊరట దక్కింది. కాకినాడ సిటీలో జనసేనాని పర్యటనకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకినాడలో ఎన్నికల ప్రచారానికి అనుమతి వచ్చింది. ఇవాళ కాకినాడ సిటీలో ప్రచారానికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావించారు.

ఈ మేరకు పోలీసుల్ని కలిసి అనుమతి కోరారు.. అయితే అదే రోజు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రచారం కూడా ఉండటంతో అనుమతి నిరాకరించారు. అయినా సరే కూటమి నేతలు మాత్రం పట్టు వీడలేదు. పోలీస్ స్టేషన్‌లోనే మకాం వేయగా.. చివరికి శనివారం వేకువజామున అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ సిటీలో ప్రచారానికి వెళుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement