Tuesday, July 2, 2024

AP | గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : సీఎం చంద్రబాబు

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్లకు చెందిన దాసరి గోపీకృష్ణ అనే యువకుడు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అతనిని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నాను. దాసరి గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement