Sunday, September 8, 2024

సీఎం జ‌గ‌న్ నివాసం స‌మీపంలో గోశాల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాడేపల్లిలో నివాసం సమీపంలోని పార్కింగ్ స్థలంలో గోశాలను ఏర్పాటు చేశారు. తిరుపతి నుండి ఆరు గోవులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీసుకువచ్చారు. సీఎం జగన్ సతీమణి భారతి గోవులకు పూజచేసి గోశాలకు తరలించినట్టు అనధికారిక సమాచారం. అయితే ఇంత సడన్ గా గోశాల ఏర్పాటు చేయ‌డంపై వైసీపీ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జ‌రుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement