Friday, October 18, 2024

Good News – విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఉండ‌దు… తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి కుమార‌స్వామి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ విశాఖ‌ప‌ట్నం – విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమార‌స్వామి శుభ‌వార్త వినిపించారు.. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఉండదని స్పష్టం చేశారు.. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం నాడు స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని అన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్‌ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయంతో పాటు ప్ర‌క‌ట‌న కూడా ఉంటుందని తెలిపారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తనకు 2 నెలలు సమయమివ్వాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement