Tuesday, October 22, 2024

AP | విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఫీజు రీయంబర్స్‌మెంట్ !

అమరావతి, ఆంధ్రప్రభ: గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు పరోక్షంగా వెల్లడిస్తు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ మంగళవారం తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

పీజు రీయంబర్స్‌మెంట్‌పై త్వరలో గుడ్‌ న్యూస్‌ వింటారంటూ ఆయన ట్వీట్‌ చేయడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రూ 3500 కోట్ల పీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించకుండా విద్యార్ధులను మోసం చేసిందని నారా లోకేష్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

విద్యార్ధులకోసం ఫీజురీయంబర్స్‌మెంట్‌ సమస్యను సహచర మంత్రుల సహకారంతో నేడు జరుగనున్న క్యాబినెట్‌ భేటీలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ భేటీ అనంతరం ఫీజురీయంబర్స్‌మెంట్‌ విషయంలో శుభావార్త వింటారని హామీ ఇస్తున్నానని లోకేష్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement