Tuesday, September 17, 2024

AP | పింఛందారులకు గుడ్ న్యూస్..

ఏపీలో పింఛన్‌దారులకు పింఛన్ల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొంతమంది పింఛన్‌దారులు ఉపాధి లేదా ఇతరత్రా అవసరాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే నివశిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు.

ప్రస్తుతం నివాసముంటున్న చోట లేదా కోరుకున్న చోటికి పింఛన్లు బదలాయించుకోవాలనుకునే లబ్ధిదారులు… ఇందుకోసం ప్రస్తుతం పింఛను పొందుతున్న సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement