Friday, September 20, 2024

గౌత‌మ్ రెడ్డి మృతి… క‌న్నీటి ప‌ర్యంత‌మైన వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించి విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలోని పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈసంద‌ర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌతమ్ రెడ్డి తల్లి, భార్యను పరామర్శించి.. కన్నీటి పర్యంతమయ్యారు. మేకపాటి గౌతమ్ మృతి కేవలం వారి కుటుంబానికే కాదు.. వైఎస్ కుటుంబానికి కూడా తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement