Friday, September 20, 2024

AP | పుంగనూరులో గంజాయి క‌ల‌క‌లం.. ఆరుగురు అరెస్టు

పుంగనూరు, (ప్రభ న్యూస్) : పుంగనూరు పట్టణంలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. కొన్నాళ్ళుగా సాగుతున్న గంజాయి వ్యాపారం వెలుగు చూసింది. మంగళవరం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పుంగనూరు పోలీసులు 59 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం మేరకు భగత్సింగ్ కాలనీలోని అగ్నిమాపక కేంద్రం వెనుక నవీద్ అహ్మద్ కు చెందిన ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 59 కిలోల గంజాయి ప్యాకెట్లు 29 లభించాయని పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5.94 లక్షలు ఉంటుందని వెల్ల‌డించారు.

కాగా, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ గంజాయిని తిరుపతి నుంచి పుంగునూరుకు ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లినట్లు నిందితులు తెలిపారని…. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారని డీఎస్పీ తెలిపారు.

దాడులు నిర్వహించి గంజాయి గుట్టు రట్టు చేసిన సీఐ జయరామయ్య, ఎస్సై సుబ్బారెడ్డి, ఏఎస్సై జయచంద్ర హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ కుమార్, సిబ్బంది ఎల్లప్ప, చిన్న రెడ్డప్ప, ప్రకాష్, రమణలను డీఎస్పీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement